Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అప్‌డేట్: దేశంలో పదివేల మరణాలు.. పదివేల కేసులు..

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (10:11 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా సోమవారం దేశ వ్యాప్తంగా 380మంది కరోనా బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 9900కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

ఇక, కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,667 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ బారినపడినవారి సంఖ్య 3,43,091కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. 
 
మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,80,013మంది కోలుకోగా మరో 1,53,178మంది చికిత్స పొందుతున్నారు. కానీ దేశంలో వైరస్‌ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 52.5శాతంగా ఉంది.
 
ప్రస్తుతం కేంద్రం మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఈ 8 రాష్ట్రాల్లో కరోనా కేసులు 10వేలకు పైగా ఉన్నాయి. ఇకపోతే.. తాజా మరణాల సంఖ్యతో బెల్జియంను దాటి భారత్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానానికి చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో మాత్రం భారత్‌ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments