Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఓ కరోనా రోగి మృతి

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:35 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం భయంతో వణికిపోతోంది. ఇప్పటికే అనేక దేశాలను సర్వనాశనం చేసిన ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు ఇపుడు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. ముఖ్యంగా, న్యూయార్క్ మహానగరంలో మరింత భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. ఇక్కడ ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక కరోనా రోగి ప్రాణాలు కోల్పోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా పరిస్థితి విషమించి పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను నిజం చేసేలా అమెరికాలో ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇప్ప‌టికే అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య 2.50 దాటిపోయింది. ఇక మరణాల సంఖ్య కూడా 8 వేలు మించిపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 60 వేల ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ మ‌హ‌మ్మారి.. అమెరికాలో శుక్రవారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఎంత‌లా అంటే న్యూయార్క్‌లో ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఒక వ్య‌క్తి చనిపోతున్నాడు. అయితే అక్కడ పేషంట్లకు సరిపోయేన్ని వెంటిలేటర్లు లేకపోవడమే ప్రధాన కారణమని అక్క‌డి అధికారులు చెపుతున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లోనే కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య త్యధికంగా నమోదైందని పేర్కొంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments