దేశంలో 2 లక్షల దిగువకు కరోనా కేసులు.. 44 రోజుల కనిష్ట స్థాయికి

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (10:36 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. 2 లక్షలకు దిగువకు పడిపోయింది. ఇది 44 రోజుల కనిష్ట స్థాయికి సమానం. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,86,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
ఆ ప్రకారంగా గురువారం 2,59,459 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,55,457కు చేరింది. మరో 3,660 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,18,895కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,48,93,410 మంది కోలుకున్నారు. 23,43,152 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,57,20,660 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
మరోవైపు, దేశంలో గురువారం వరకు 33,90,39,861 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఒక్క గురువారమే 20,70,508 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికాలో రాజా సాబ్ ఫట్.. మన శంకర వర ప్రసాద్ గారు హిట్.. అయినా ఫ్యాన్స్ అసంతృప్తి.. ఎందుకు?

Allu Aravind: బాస్ ఈజ్ బాస్ చించేశాడు అంటున్న అల్లు అరవింద్

Havish: నేను రెడీ ఫన్ ఫిల్డ్ టీజర్ రిలీజ్, సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్

Malavika: స్టంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం, మాళవికా మోహనన్

Sobhita : ఆకట్టుకుంటున్న శోభితా ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

తర్వాతి కథనం
Show comments