Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రైతుకు వజ్రం రూపంలో వరించిన అదృష్టం

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (10:30 IST)
ఓ తెలుగు రైతుకు వజ్రం రూపంలో అదృష్టం వరించింది. దీంతో ఆ రైతు రాత్రిక రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా చిన్నజోన్నగిరి ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు గురువారం పొలం పనులు చేసుకుంటుండగా.. అతడికి విలువైన వజ్రం లభించింది.
 
ఈ విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారాలు ఆ అన్నదాత ఇంటికి క్యూ కట్టారు. ఇక దాన్ని సీక్రెట్‌గా వేలం వేయగా.. గుత్తికి చెందిన వ్యాపారి ఒకరు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదిలావుంటే మార్కెట్‌లో ఆ వజ్రం ధర ఏకంగా రూ.3 కోట్లకు పైగా ఉంటుందని వజ్రవ్యాపారులు అంచనా వేస్తున్నారు.
 
కాగా, గతంలోనూ జొన్నగిరికి చెందిన వ్యక్తికి రూ.37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా తొలకరి జల్లులకు ఈ ప్రాంతంలో చిన్నా, పెద్ద వజ్రాలు దొరుకుతాయని స్థానిక ప్రజలు చెబుతుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments