తెలంగాణలో కరోనా వైరస్ రోగులు 17, దేశంలో 223 మంది

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (22:34 IST)
భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 223కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు తెలిపింది. ఈ జాబితాలో 32 మంది విదేశీయులు, చనిపోయిన నలుగురు రోగులు కూడా ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 52 పాజిటివ్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి, ఇది దేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించి అత్యధికం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్, ముంబై, పూణేల్లో లాక్డౌన్ ప్రకటించింది.
 
హైదరాబాద్ మరో COVID-19 పాజిటివ్ కేసు నమోదైంది. దీనితో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసులు 17కి చేరుకుంది. కొత్తగా నమోదైన హైదరాబాద్ రోగి లండన్ వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది. ఇక కేరళలో 28, ఉత్తర ప్రదేశ్ 23, పశ్చిమ బెంగాల్ 2, లడఖ్ 10, ఢిల్లీ 17, ఆంధ్రప్రదేశ్ 3 కేసులు నమోదయ్యాయి.
 
కాగా 22 మంది రోగులు ఇప్పటివరకు కరోనా వైరస్ నుండి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అగర్వాల్ మాట్లాడుతూ... కరోనా వైరస్‌తో పోరాడటానికి అవసరమైన వస్తువుల కొరత లేదన్నారు. కరోనా వైరస్ కారణంగా మన దేశంలో మరణించిన వారిలో శుక్రవారం జైపూర్‌లో మరణించిన ఇటాలియన్ వ్యక్తి లెక్కించబడడని తెలిపారు. కనుక దేశంలో మరణించిన వారి సంఖ్య నాలుగు అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas-Anushka Wedding: ప్రభాస్ - అనుష్కల వివాహం.. ఏఐ వీడియో వైరల్.. పంతులుగా ఆర్జీవీ

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments