Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ వికటించి యువకుడు మృతి, పెళ్లింట విషాదం

Webdunia
గురువారం, 1 జులై 2021 (17:19 IST)
మూడు రోజుల క్రితం తమ్ముడు వివాహం జరిగింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. కరోనా విలయతాండవం కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవీ సీల్డ్ టీ కా వికటించి వుగ్గిన ఎల్లాజీ (33) అనే యువకుడు గురువారం మృతి చెందడంతో ఆ కుటుంబం లో తీవ్ర విషాదాన్ని నింపింది. 
 
వివరాల్లోకెళ్తే  సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామానికి చెందిన ఉగ్గిన ఎల్లాజీ విజయనగరం జిల్లా కొత్తవలస లో ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీ ఉద్యోగులందరికీ విశాఖపట్నంలోని సీతమ్మధారలో బుధవారం కరోనా నివారణకు కోవీషీల్డ్ టీకాలు వేస్తున్నారని సమాచారంతో వుగిన ఎల్లాజీ వ్యాక్సిన్ వేయించుకుని బుధవారం సాయంత్రం ఎల్లుప్పి లోని తన స్వగృహానికి చేరాడు.
 
అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఎల్లాజీ బుధవారం రాత్రి స్వల్పంగా జ్వరం బారిన పడ్డాడు. టీకాలు వేయించుకున్న వారికి సహజంగా జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటాయని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు సాధారణంగా తీసుకున్నారు.
 
అర్ధరాత్రివేళ వాంతులు విరేచనాలతో పాటు, బ్రీతింగ్ సమస్య ఎదురు కావడంతో  విశాఖపట్నం ఆసుపత్రికి తరలించేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా,108 అంబులెన్స్ లో విశాఖ తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో  కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.
 
ఇదిలా ఉండగా ఎల్లాజీకి 2019లో వివాహం కాగా భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. మృతుని భార్య రోదించడంతో ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. ఎల్లాజీ మృతిపై గ్రామ సర్పంచ్ ఉద్యాన నాయుడు మాట్లాడుతూ, ఎల్లాజీ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments