తెలంగాణలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 493 పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:25 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 493 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. దీంతో తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,04,791కు పెరిగింది. మరో నలుగురు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 1,680కు చేరింది. తాజాగా 157 మంది డిశ్చార్జి అవగా ఇప్పటి వరకు 2,99,427 మంది కోలుకున్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 3,684 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. 1616 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో 138 పాజిటివ్‌ కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే రికార్డయినట్లు పేర్కొంది. గత వారం రోజులుగా జీహెచ్‌ఎంసీలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 56,464 పరీక్షలు చేసినట్లు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virosh: కొత్త లైఫ్ ను స్టార్ చేస్తున్నాం.. ఆశీర్వదించండి : రష్మిక మందన్న

పావలా శ్యామలకు అల్లు అర్జున్ ప్రతి నెలా ఆర్థిక సాయం.. ఎంతంటే?

Tarun Bhaskar: క్రేజీ కల్యాణం మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్

Toxic: postponed: యుద్ధం కారణంగా రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్: విడుదల వాయిదా

Chiranjeevi 158: ఉగాదికి ముందే షూటింగ్ కు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments