corona second wave: ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు ఒక్కసారిగా మృతి

Webdunia
సోమవారం, 3 మే 2021 (16:16 IST)
కర్నాటకలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన 24 మంది రోగులకు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా కర్ణాటకలోని చమరాజనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
ఐతే ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఆసుపత్రిలోని 24 మంది కరోనా రోగులు చనిపోయారు. ఆక్సిజన్ అందకే వారు మరణించారని వారి తరపు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే చమరాజనగర్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎంఆర్ రవి మాట్లాడుతూ, ఆక్సిజన్ లేకపోవడంతో రోగులు మరణించారా లేదా వేరే కారణమా అనేది ఇంకా తేల్చలేదు.
 
"ఆక్సిజన్ లేకపోవడం వల్ల అందరూ చనిపోయారా అని మేము చెప్పలేము," అని చెప్పాడు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. ఈ సంఘటనపై తాను చమరాజనగర్ జిల్లా కమిషనర్‌తో మాట్లాడానని, మంగళవారం సాయంత్రం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని కూడా పిలిచానని కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యెడియరప్ప తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments