Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మరణమృదంగం : ఎవరిని బతికిస్తారో.. ఎవరిని చంపేస్తారో మీ యిష్టం!!

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (20:13 IST)
ప్రపంచంలో అన్న అందమైన దేశాల్లో అది ఒకటి. కానీ, ప్రస్తుతం ఆ దేశం శ్మశానవాటికను తలపిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ సంఖ్యలో చైనాను అధికమించింది. దీంతో శవాలను పాతిపెట్టేందుకు స్థలం లేక ఐస్ రింకుల్లో స్టోర్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ దేశమే స్పెయిన్. కరోనా వైరస్ బారినపడినవారిలో తిరిగి కోలుకుంటారనే భావించే వారికి మాత్రమే వైద్యం చేస్తున్నారు. వయసు మళ్లిన వారికి వైద్యం చేయలేక చేతులెత్తేశారు. అంటే స్పెయిన్ ఎంత దుర్భరస్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. 
 
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఉన్న అతిపెద్ద ఆస్పత్రిలో పని చేసే చీఫ్ డాక్టర్లలో డానియేల్ బెర్నాబ్యూ ఒకరు. ఈయన తమ దేశంలో నెలకొన్న తాజా పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించారు. తమ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌గా లోనికి వచ్చి, ఆసుపత్రిలో అడ్మిట్ కాకుండానే చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వీరి మృతదేహాలు వెయిటింగ్ రూమ్‌లో పెరుగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లోని శ్మశాన వాటికల్లో స్థలాలు లేక, ఐస్‌రింక్‌ల్లో మృతదేహాలను స్టోర్ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని తీవ్ర ఆవేదనతో చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసియు) నిబంధనలు కూడా మారిపోయాయి. కరోనా పాజిటివ్‌గా సోకి తొలుత వచ్చిన వయోవృద్ధులను పక్కనబెట్టి, రికవరీ చాన్స్‌లు అధికంగా ఉండే యువతను తొలుత లోనికి తీసుకెళుతున్నామని బెర్నాబ్యూ చెప్పారు. పైగా, కరోనా వైరస్ బారినపడినవారిలో ఎవరికి చికిత్స చేయాలి.. ఎవరిని వదిలివేయాలన్న విషయాన్ని వైద్యులకే వదిలివేసినట్టు చెప్పారు.
 
తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశాన్ని రక్షించుకునేందుకు ఈ చర్య తప్పడం లేదని ఆయన తీవ్ర విషణ్ణవదనంతో చెప్పారు. "ఆయనో తాతయ్య. మరే విధమైన పరిస్థితి అయినా, ఆయన్ను బతికించేందుకు మొత్తం శ్రమించే వాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆయన వయసువారే అందరూ. అందరూ ఒకేసారి మరణిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
 
కాగా, స్పెయిన్‌లో తాజాగా మరో 738 మంది ప్రాణాలు కోల్పోగా, ఇక్కడ మరణాల సంఖ్య 4,089కి పెరిగాయి. అంటే చైనాను అధికమించిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రధాని పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ, ఇంత విపత్కర పరిస్థితి గతంలో ఎన్నడూ సంభవించలేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments