దేశంలో కరోనా కల్లోలం : 14 వేలకు చేరిన కేసులు.. మరణాల్లో పెరుగుదల

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:18 IST)
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,793కు చేరుకోగా, మరణాల సంఖ్య 488కి పెరిగింది. 
 
ఇప్పటివరకు 2014 మంది కోలుకున్నారని, దేశవ్యాప్తంగా 12,289 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అటు రాష్ట్రాల్లో కరోనా ధాటి కొనసాగుతోంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,323గా నమోదైంది. ఇప్పటివరకు అక్కడ 201 మంది మరణించారు.
 
ఇదే అశంపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 991 కొత్త కేసులు నమోదయ్యాయని, 43 మంది ప్రాణాలు విడిచారని వెల్లడించారు.
 
23 రాష్ట్రాల్లోని 45 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని గుర్తుచేశారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక, ఏపీలో కరోనా నివారణ చర్యల గురించి చెబుతూ, విశాఖలో కట్టుదిట్టమైన చర్యలతో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments