Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కల్లోలం : 14 వేలకు చేరిన కేసులు.. మరణాల్లో పెరుగుదల

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:18 IST)
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14,793కు చేరుకోగా, మరణాల సంఖ్య 488కి పెరిగింది. 
 
ఇప్పటివరకు 2014 మంది కోలుకున్నారని, దేశవ్యాప్తంగా 12,289 కేసులు క్రియాశీలకంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అటు రాష్ట్రాల్లో కరోనా ధాటి కొనసాగుతోంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,323గా నమోదైంది. ఇప్పటివరకు అక్కడ 201 మంది మరణించారు.
 
ఇదే అశంపై కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 991 కొత్త కేసులు నమోదయ్యాయని, 43 మంది ప్రాణాలు విడిచారని వెల్లడించారు.
 
23 రాష్ట్రాల్లోని 45 జిల్లాల్లో రెండు వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదని గుర్తుచేశారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వైద్యుల సూచనలు లేకుండా మందులు వాడరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక, ఏపీలో కరోనా నివారణ చర్యల గురించి చెబుతూ, విశాఖలో కట్టుదిట్టమైన చర్యలతో కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments