Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్ఘన్ అధ్యక్ష భవనంలో 20మందికి కరోనా.. డాక్యుమెంట్ల ద్వారా వ్యాప్తి

Advertiesment
Coronavirus
, శనివారం, 18 ఏప్రియల్ 2020 (19:29 IST)
ఆప్ఘనిస్థాన్ అధ్యక్ష భవనంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఇప్పటికే అక్కడి సిబ్బందిలో 20మందికి కోవిడ్‌-19 వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇతర శాఖల నుంచి అధ్యక్ష భవనానికి వచ్చిన పలు డాక్యుమెంట్ల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దాంతో అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీ ఉద్యోగులను ఎవరినీ కలువటంలేదు. అత్యవసర సమావేశాలు కూడా వర్చువల్‌గానే నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష భవనం వర్గాలు తెలిపాయి.
 
ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. స్పెయిన్‌లో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో ఈ మహమ్మారి 565 మందిని పొట్టనపెట్టుకుండి. దీంతో మృతుల సంఖ్య 20,043 చేరుకుతుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే శుక్రవారం కంటే మృతుల సంఖ్య కాస్త తగ్గిందని తెలిపింది.
 
అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 23 లక్షలకు చేరువలో ఉంది. 1,54,350 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ను అరికట్టేందకు ప్రపంచదేశాలన్ని తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో మ్యాటర్‌హార్న్‌ శిఖరంపై మువ్వన్నెల జెండా.. ఎలా?