Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 4 నుంచి ఎయిర్‌ ఇండియా దేశీయ విమాన సర్వీసులు

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:14 IST)
మే 4వ తేది నుంచి దేశీయ విమానాల టికెట్‌ బుకింగ్‌ ప్రకియ ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా సంస్థ  ప్రకటించింది. అయితే మే 31 వరకు అంతర్జాతీయ విమానాల బుకింగ్‌కు అనుమంతించడం లేదని.. జూన్‌ 1 నుంచి ఇంటర్నేషనల్‌ బుకింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

కాగా కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించగా.. అత్యవసర సేవలకు మినహా అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలు సైతం రద్దు అయిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగుస్తున క్రమంలో ఎయిర్‌ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ప్రస్తుత పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రతి అప్‌డేట్‌ను అందిస్తుంటామని ఎయిర్‌ ఇండియా తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా అలాగే చైనా వంటి అంతర్జాతీయ మార్గాలకు వైద్య సామాగ్రి తరలింపు కోసం విమాన సర్వీసులను నడుపుతోంది.

దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరుకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్‌ ఉడాన్’ విమానాలు నడుపుతున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నివేదించింది. ఇక ఈ రోజు(శనివారం) ఉదయం ఎయిర్ ఇండియా బి -787 విమానం ఢిల్లీ నుంచి వైద్య సామాగ్రిని తీసుకొని చైనాకు వెళ్లినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments