Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో కొత్తరకం వేరియంట్.. పేరేంటో తెలుసా? ఎన్-440 రకం

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:49 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా చెలరేగిపోతున్న వేళ ఛత్తీస్‌గఢ్‌లో కొత్తరకం వేరియంట్ వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఐదు వేర్వేరు నమూనాలను పరిశీలించిన అనంతరం ఈ వేరియంట్‌ను నిర్ధారించారు.
 
రోగులపై ఈ వేరియంట్ ఏమేరకు ప్రభావం చూపిస్తుందన్న విషయంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌కు N-440గా నామకరణం చేశారు. మనుషుల్లోని రోగ నిరోధకశక్తిని ఇది బలహీనం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
ఎన్-440 రకం వైరస్‌ ఉనికిని కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల నిర్ధారించినట్టు చత్తీస్‌గఢ్ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్‌దేవ్ తెలిపారు. అయితే, ఇది ప్రాణాంతకం కాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బ్రిటిష్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. 
 
కాగా, బుధవారం రాష్ట్రంలో కొత్తగా 4,563 కేసులు నమోదయ్యాయి. వైరస్ వెలుగుచూసిన రాష్ట్రంలో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని అధికారులు తెలిపారు. అలాగే, నిన్న 39 మంది కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,170కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments