Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మూడో దశ అల వచ్చే అవకాశాలు చాలా తక్కువే : ఐసీఎంఆర్ సైంటిస్ట్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:02 IST)
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ... చిన్నారులను ఇప్పుడే స్కూళ్లకు పంపొద్దని సూచించారు.
 
ఒకవేళ దేశంలో మూడో వేవ్ వచ్చినా కూడా ఇంతకుముందులా అంత ప్రభావం ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెర‌వ‌క‌పోవ‌డమే మంచిదని అభిప్రాయపడ్డారు. తప్పని పరిస్థితుల్లో తెరిస్తే మాత్రం ఎక్కువమంది ఉండకుండా రోజుమార్చి రోజు విధానాలు పాటిస్తే మంచిదన్నారు. 
 
తమ సర్వే ప్రకారం మూడింట రెండు వంతుల మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందిన‌ట్లు తేలిందని.. అంతేకాకుండా వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందన్నారు. 
 
చిన్నారుల‌కు కరోనా సోకినా.. వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. అయినా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని.. ప్రజలందరూ జాగ్ర‌త్త‌లు పాటించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments