కరోనా మూడో దశ అల వచ్చే అవకాశాలు చాలా తక్కువే : ఐసీఎంఆర్ సైంటిస్ట్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:02 IST)
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ... చిన్నారులను ఇప్పుడే స్కూళ్లకు పంపొద్దని సూచించారు.
 
ఒకవేళ దేశంలో మూడో వేవ్ వచ్చినా కూడా ఇంతకుముందులా అంత ప్రభావం ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెర‌వ‌క‌పోవ‌డమే మంచిదని అభిప్రాయపడ్డారు. తప్పని పరిస్థితుల్లో తెరిస్తే మాత్రం ఎక్కువమంది ఉండకుండా రోజుమార్చి రోజు విధానాలు పాటిస్తే మంచిదన్నారు. 
 
తమ సర్వే ప్రకారం మూడింట రెండు వంతుల మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందిన‌ట్లు తేలిందని.. అంతేకాకుండా వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందన్నారు. 
 
చిన్నారుల‌కు కరోనా సోకినా.. వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. అయినా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని.. ప్రజలందరూ జాగ్ర‌త్త‌లు పాటించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments