Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, అందరికీ సర్వదర్సనం టోకెన్లు, ఎప్పట్నుంచి అంటే?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:01 IST)
సర్వదర్సనం టోకెన్లను కేవలం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టిటిడి అందిస్తోంది. గత నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి అశేష స్పందన లభిస్తోంది. పెద్ద ఎత్తున భక్తులు టోకెన్ల కోసం కౌంటర్ల వద్దకు చేరుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం అతిథి గృహంలో టోకెన్లను అందిస్తోంది టిటిడి.
 
అయితే చిత్తూరు జిల్లా వాసులకే కాకుండా భక్తులందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు టోకెన్లు ఇచ్చే శ్రీనివాసం వసతి సముదాయాల వద్దకు చేరుకుని ఆందోళనకు కూడా దిగారు. దీంతో టిటిడి ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు.
 
ఈ నేపథ్యంలో టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. మరో వారంరోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా సర్వదర్సనానికి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ చెప్పారు. సుపథం దర్సనానికి ఎన్ని టిక్కెట్లు మంజూరు చేస్తున్నారో అంతకు రెట్టింపుగా సర్వదర్సనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు.
 
టోకెన్ల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నట్లు చెప్పారు. కౌంటర్ల ద్వారా టోకెన్లను పొందే సమయంలో ఆ టోకెన్లు అయిపోయాయని.. భక్తుల ఆందోళనకు దిగడం.. లాఠీఛార్జీ వంటి పరిణామాలు జరగడం బాధాకరమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments