త‌గ్గిన‌ట్లే త‌గ్గి పెరుగుతున్న క‌రోనా, త‌స్మాత్ జాగ్ర‌త్త‌

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:02 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాలు తగ్గినట్టే తగ్గి, మ‌ళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా 42,766 మందికి కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా వెయ్యికి దిగువనే నమోదవుతోన్న మరణాలు నిన్న భారీగా పెరిగాయి. తాజాగా 1,206 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,07,95,716కి చేరగా, 4,07,145 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. నిన్న 19,55,225 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది.
 
ఇక 24 గంటల వ్యవధిలో 45,254 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.99 కోట్లకు చేరగా.. ఆ రేటు 97.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,55,033 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.48 శాతానికి తగ్గింది. మరోపక్క నిన్న 30,55,802 మంది టీకాలు తీసుకున్నారు.

ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు సంఖ్య 37కోట్ల మార్కును దాటింది. అయినా మ‌ళ్ళీ క‌రోనా పెరిగే అవ‌కాశం ఇవ్వ‌కుండా ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగానే ఉండాల‌ని వైద్య ఆరోగ్య శాఖ కోరుతోంది. క‌రోనా నియ‌మాల‌ను పాటించాల‌ని వైద్య‌నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments