ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు- అధికారుల్లో టెన్షన్

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (22:33 IST)
కరోనా వైరస్ ముంబై నగరంలోని ధారావి ప్రాంతంలో భయంకరంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఒమిక్రాన్ కూడా ధారావిని తాకింది. దీంతో ముంబై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 
 
దక్షిణాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మన దేశాన్ని కూడా పలకరించింది. ఇప్పటికే దేశంలో 25 ఒమిక్రాన్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. 
 
ఆసియాలోన అతిపెద్ద మురికివాడగా పేరున్న ధారావిలో ఒమిక్రాన్ కేసు బయటపడింది. ధారావికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణ అయ్యింది. 
 
డిసెంబర్ 4న ఆయన టాంజానియా నుంచి ముంబై చేరుకున్నారని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments