Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. బూస్టర్‌పై చర్చ

25కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. బూస్టర్‌పై చర్చ
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:30 IST)
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి మొదలైంది. దేశంలో రెండు తాజా ఒమిక్రాన్ కేసులు నమోదైనాయి. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఇవి వెలుగు చూశాయి. 
 
దేశంలో నమోదైన రెండు ఒమిక్రాన్ కేసులతో కరోనా కొత్త వేరియంట్ సంఖ్య 25కి పెరిగింది. వివరాల్లోకి వెళితే,  డిసెంబర్ 4న జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.
 
ఆ వ్యక్తి కాంటాక్ట్స్ లోనే ఈ ఇద్దరికి ఇవాళ ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన జింబాబ్వే వ్యక్తిని కలిసిన పది మందిని క్వారంటైన్‌లో పెట్టారు. 
 
ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో బూస్టర్ డోసుపైనా చర్చ జరుగుతోంది. అవసరముంటే బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చని, అయితే, సెకండ్ డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే తీసుకోవాలని ఆరోగ్యశాఖ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారికి భారీ కానుక, ఐదున్నర కిలలో బంగారంతో తయారు చేయించి...