ఆ పాము విషంతో క‌రోనాకు చెక్ ... శాస్త్రవేత్తల ఆవిష్కరణ

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (18:23 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క శాస్త్రవేత్త లేదా దేశం సరైన మందును కనిపెట్టలేకపోయింది. అందుకే ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా వ్యాక్సిన్లను పలు దేశాలు అభివృద్ధి చేశాయి. 
 
ఈ నేపథ్యంలో బ్రెజిల్ అడ‌వుల్లో క‌నిపించే స‌ర్పం జ‌రారాకుసోకు చెందిన విషంతో కోవిడ్‌19ను అంతం చేయ‌వ‌చ్చు అని శాస్త్ర‌వేత్త‌లు గట్టిగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్య‌య‌న నివేదిక‌ను సైంటిఫిక్ జ‌ర్న‌ల్ మాలిక్యూల్స్‌లో ప్ర‌చురించారు. 
 
ర‌క్త‌పింజ‌ర జ‌రారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆ స‌ర్ప విష అణువులు కోతుల్లో 75 శాతం క‌రోనా వైర‌స్ క‌ణాల వృద్ధిని నియంత్రిస్తున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. 
 
ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాణాంత‌కంగా మారుతున్న కోవిడ్ వ్యాధి నివార‌ణ‌లో వైప‌ర్ స్నేక్ జ‌రారాకుసో విషంలో ఉన్న అణువులు కీల‌కం కానున్న‌ట్లు భావిస్తున్నారు. సావో పౌలో యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ రాఫేల్ గైడో దీనికి సంబంధించిన వివ‌ర‌ణ ఇచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments