Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్‌లో కోవిడ్ వైరస్.. రోజుకు 2వేల మంది మృతి

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (11:06 IST)
బ్రెజిల్‌లో కోవిడ్ వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో రోజూ 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అలాగే కరోనా మృతుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది బ్రెజిల్. ఇప్పటివరకూ ఈ దేశంలో 2,68,370 మంది చనిపోయారు. బుధవారం ఒక్క రోజే 2,286 మంది కన్నుమూశారు. 
 
పీ1 అని పేరు పెట్టిన కొత్త కరోనావైరస్ రకం వ్యాప్తి వల్ల దేశంలో కేసుల సంఖ్య మళ్లీ విపరీతంగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఈ కరోనావైరస్ రకం.. మానాస్ అనే అమెజాన్ నగరంలో పుట్టినట్లు భావిస్తున్నారు. కోవిడ్ కేసులు విపరీతంగా పెరగటంతో బ్రెజిల్‌లోని పెద్ద నగరాల్లో ఆరోగ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. చాలా ఆస్పత్రులు కుప్పకూలే పరిస్థితికి చేరుకున్నాయని దేశంలో ప్రధాన ప్రజారోగ్య కేంద్రం ఫియోక్రజ్ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments