Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (19:01 IST)
కరోనా వైరస్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్య నిపుణులతో ఈ రోజు చంద్రబాబు వీడియో కాన్పెరెన్స్ నిర్వహించారు. ఇందులో చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
 
కరోనా బాధితులకు ఆస్పత్రిలో కనీసం పడకలు లేని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఇక వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ.5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణించి పోయిందని తెలిపారు.
 
కరోనా వలన ఆర్థికంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఇక ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకు పెరిగిపోతున్నది. రాష్ట్రంలో కొత్తగా 10,392 కేసులు నమోదు కాగా మొత్తం 60,804 శాంపిల్స్‌ను పరీక్షించారు.
 
ఇక మరో 8,454 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో కొత్తగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 4,55,531 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,30,076 యాక్టివ్ కేసులున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments