Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా బులిటెన్ : కొత్తగా 5741 పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (18:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 5741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 96,153 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,741 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ముఖ్యంగా, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 831 కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 830 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 130 కేసులు గుర్తించారు.
 
ఇక తాజాగా రాష్ట్రంలో 53 కరోనా మరణాలు సంభవించగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 12 మంది చనిపోయారు. తాజా మరణాలతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 12,052కి చేరింది.
 
అదే సమయంలో 10,567 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటివరకు 18,20,134 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,32,948 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 75,134కి తగ్గింది.

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments