ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా.. 24 గంటల్లో 348 కేసులు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (23:04 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 41,244 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 348 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందినట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్. ఇదే సమయంలో 358 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు.
 
ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,98,46,690కు చేరింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,69,066కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,51,440కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,220గా ఉంటే.. మృతుల సంఖ్య 14,406కు పెరిగింది. మరోవైపు, తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 69, చిత్తూరులో 52 కేసులు వెలుగుచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments