Webdunia - Bharat's app for daily news and videos

Install App

2న కరోనా టీకా డ్రై రన్‌ : ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే...

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (17:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేశాయి. వీటిలో కొన్నింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ టీకాలను అత్యవసర వినియోగం కింద భారత్‌లో కూడా పంపిణీ చేయనున్నారు. 
 
ఇందులోభాగంగా, వ్యాక్సిన్ పంపిణీ కోసం ముందస్తు ఏర్పాట్లకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా శనివారం డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షతన గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు డ్రై రన్‌ విధివిధానాలపై చర్చించారు.
 
ప్రతి రాష్ట్రంలోని రాజధానిలో కనిష్ఠంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో డ్రై రన్‌ నిర్వహిస్తారు. వైరస్‌ తీవ్రత ఎక్కువ, రవాణా సౌకర్యం తక్కువగా ఉన్న పలు జిల్లాల్లోనూ డ్రైరన్‌ నిర్వహించనున్నారు. 
 
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రాజధానుల్లోకాకుండా ఇతర ప్రధాన నగరాల్లో డ్రై రన్ నిర్వహించే అవకాశం ఉంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే గత నెల 28, 29న తొలి విడుత డ్రై రన్‌ కొనసాగిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం