Webdunia - Bharat's app for daily news and videos

Install App

2న కరోనా టీకా డ్రై రన్‌ : ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే...

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (17:26 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. అయితే, ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఫార్మా కంపెనీలు టీకాలను తయారు చేశాయి. వీటిలో కొన్నింటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ఈ టీకాలను అత్యవసర వినియోగం కింద భారత్‌లో కూడా పంపిణీ చేయనున్నారు. 
 
ఇందులోభాగంగా, వ్యాక్సిన్ పంపిణీ కోసం ముందస్తు ఏర్పాట్లకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా శనివారం డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 
 
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షతన గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు డ్రై రన్‌ విధివిధానాలపై చర్చించారు.
 
ప్రతి రాష్ట్రంలోని రాజధానిలో కనిష్ఠంగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో డ్రై రన్‌ నిర్వహిస్తారు. వైరస్‌ తీవ్రత ఎక్కువ, రవాణా సౌకర్యం తక్కువగా ఉన్న పలు జిల్లాల్లోనూ డ్రైరన్‌ నిర్వహించనున్నారు. 
 
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో రాజధానుల్లోకాకుండా ఇతర ప్రధాన నగరాల్లో డ్రై రన్ నిర్వహించే అవకాశం ఉంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇప్పటికే గత నెల 28, 29న తొలి విడుత డ్రై రన్‌ కొనసాగిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం