Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన కేసు.. తల్లి నుంచి బిడ్డకు యాంటీ బాడీలు.. బొడ్డు తాడులో?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (18:08 IST)
అమెరికాలో కరోనా టీకా తీసుకున్న గర్భిణీ ఇటీవల ప్రసవించింది. దీంతో.. ఆ బిడ్డ శరీరంలో పుట్టుకతోనే కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా టీకా విషయంలో ఇటువంటి ఘటన జరగడం ప్రపంచంలోనే తొలిసారని వారు చెప్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సదరు మహిళ హెల్త్ కేర్ వర్కర్‌గా సేవలందిస్తుంటుంది. ఏడెనిమిది నెలల గర్భంతో ఉన్నప్పుడు ఆమె మోడర్నా రూపొందించిన కరోనా టీకా తీసుకున్నారు. దీంతో.. తల్లి నుంచి బిడ్డకు కరోనా యాంటీబాడీలు బదిలీ అవుతాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
 
అయితే.. టీకా తీసుకున్న మూడు వారాలకు ఆమె బిడ్డను ప్రసవించింది. అయితే.. కాన్పు తరువాత బొడ్డు తాడులో యాంటీబాడీలను గుర్తించినట్టు వైద్యులు డా. పాల్ గిల్బర్ట్, డా. ఛాడ్ రడ్నిక్ పేర్కొన్నారు. గర్భిణులకు ఇతర టీకాల ఇచ్చాక తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీలు చేరుతాయి. 
 
కరోనా టీకా విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుందని తొలిసారి బయటపడిందని చెప్పారు. అయితే.. ఈ యాంటీబాడీలు శిశువుకు కరోనా నుంచి రక్షణ నిస్తాయో లేదో తెలుసుకునేందుకు మరింత అధ్యయనం అవసరమని వారు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments