Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 70 కరోనా రోగుల అదృశ్యం...

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (09:43 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. దీంతో అటు ప్రభుత్వంతో పాటు.. ఇటు అధికార వర్గాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా వుంటే, కరోనా వైరస్ సోకిన వారిలో పలువురు అధికారులు, వైద్య సిబ్బందిని నానా తిప్పలు పెడుతున్నారు. తాజాగా కరోనా వైరస్ సోకిన 70 మంది కనిపించకుండా పోయారు.

పైగా, పరీక్షల సమయంలో ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాను తప్పుగా ఇవ్వడం వల్ల అదృశ్యమైన వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిందని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. వారిని పట్టుకునేందుకు పోలీసుల సాయం కోరింది. అదృశ్యమైన వారందరూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మలాడ్‌కు చెందిన వారని అధికారులు గుర్తించారు.
 
కరోనా రోగుల అదృశ్యంపై మంత్రి అస్లామ్ షేక్ స్పందిస్తూ, ఆ రోగులంతా ఎక్కడికీ పారిపోయి ఉండరని, వారి ఫోన్ నంబర్లు, చిరునామాను నమోదు చేసుకునే క్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. 
 
వారు తమ చిరునామాల్లో పేర్కొన్న చాలా ప్రాంతాలు మురికివాడలకు చెందినవేనని, వారిలో కొందరు వలస కార్మికులు కూడా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇంకొందరు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయి కూడా ఉండొచ్చన్నారు. కాగా, తప్పిపోయిన రోగుల జాబితాను బీఎంసీ తమకు అందించినట్టు డిప్యూటీ కమిషనర్ ప్రణయ్ అశోక్ తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments