Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ శివార్లలో భారీగా కేసులు.. వందమంది పైగా పాజిటివ్, లాక్డౌన్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:49 IST)
తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ శివార్లలో సైతం కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీలో కరోనా కలకలం రేపింది. గొల్లపల్లిలో ఏకంగా వంద మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు మృతి చెందారు. ఇటీవల వ్యవసాయ శాఖ నిర్వహించిన రైతు సదస్సులో వీరంతా పాల్గొనడం ద్వారా వీరికి కోవిడ్ సోకిందని స్థానికులు అంటున్నారు. 
 
గొల్లపల్లి గ్రామంలో పరీక్షలు నిర్వహించగా వంద మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మరోవైపు గొల్లపల్లితో పాటు శంషాబాద్‌లోని వివిధ గ్రామాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఇప్పటికే చిన్న గోల్కొండ ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. పాలమాకుల పాఠశాలలోనూ ఇరవై మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. అయితే వంద మందికి కరోనా కేసులు నమోదు కావడంతో.. గొల్లపల్లి గ్రామస్థులు స్వచ్ఛంధంగా లాక్‌డౌన్ విధించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments