Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ రొట్టెలు మృదువుగా వుండాలంటే?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:57 IST)
గృహిణులు వంటింట్లో అడుగు పెట్టి రుచికరమైన వంటకాన్ని తయారుచేసేందుకు తిప్పలు పడుతుంటారు. కొన్నిసార్లు అనుకున్నదానికంటే ఎక్కువ పాళ్లలో దినుసులు వేయడమో, లేదంటే కారం ఎక్కువగా వేయడమో చేసి పదార్థం రుచి దెబ్బతింటుందని బాధపడుతుంటారు. కొన్ని సమయాల్లో కొన్నింటిని ఇలా అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
పసుపు ఎక్కువైతే
కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే, అది ఎక్కువగా ఉన్న పసుపును పీల్చేసుకుంటుంది.
 
గోధుమ రొట్టెలు
గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా వస్తుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. 
 
పన్నీరు కలపాలి
గులాబ్ జామూన్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు, ఆ పిండిలో కాస్తంత పన్నీరు కలపాలి. ఇలా చేయడం వల్ల జామూన్‌లు నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి.
 
ఇడ్లీలు మృదువుగా
ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే... ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి.
 
కాకరకాయ కూర
కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయాలి. అలా చేస్తే చేదు తగ్గడమే కాకుండా, కూరకు కొత్త రుచి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments