గోధుమ రొట్టెలు మృదువుగా వుండాలంటే?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:57 IST)
గృహిణులు వంటింట్లో అడుగు పెట్టి రుచికరమైన వంటకాన్ని తయారుచేసేందుకు తిప్పలు పడుతుంటారు. కొన్నిసార్లు అనుకున్నదానికంటే ఎక్కువ పాళ్లలో దినుసులు వేయడమో, లేదంటే కారం ఎక్కువగా వేయడమో చేసి పదార్థం రుచి దెబ్బతింటుందని బాధపడుతుంటారు. కొన్ని సమయాల్లో కొన్నింటిని ఇలా అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
పసుపు ఎక్కువైతే
కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే, అది ఎక్కువగా ఉన్న పసుపును పీల్చేసుకుంటుంది.
 
గోధుమ రొట్టెలు
గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా వస్తుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. 
 
పన్నీరు కలపాలి
గులాబ్ జామూన్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు, ఆ పిండిలో కాస్తంత పన్నీరు కలపాలి. ఇలా చేయడం వల్ల జామూన్‌లు నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి.
 
ఇడ్లీలు మృదువుగా
ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే... ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి.
 
కాకరకాయ కూర
కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయాలి. అలా చేస్తే చేదు తగ్గడమే కాకుండా, కూరకు కొత్త రుచి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Holiday: మహాశివరాత్రి మరుసటి రోజు సెలవు.. జాగరణ చేసి రెస్ట్ తీసుకోవచ్చు

రూ.30 లక్షల విలువ చేసే నగలు ధరించి పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యం

ఆర్థిక సర్వే: నివసించడానికి ఉత్తమ నగరాలు-తిరుపతి, వైజాగ్‌లకు స్థానం

అమరావతి ఆర్థిక ప్రాంతం కింద 9 జిల్లాలు.. పౌరులకు గుడ్ న్యూస్

విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే బడ్జెట్ : మంత్రి నాదెళ్ల మనోహర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

ఒక్క డైలాగ్ విన్న తరువాతే బ్యాండ్ మేళం చేయాలని ఫిక్స్ అయ్యా : కోన వెంకట్

సంగీత్ శోభన్.. రాకాస ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లలో విడుదల

గోదారి గట్టుపైన నుంచి సుమంత్ ప్రభాస్ బ్రేకప్ సెలబ్రేషన్

తర్వాతి కథనం
Show comments