గోధుమ రొట్టెలు మృదువుగా వుండాలంటే?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (21:57 IST)
గృహిణులు వంటింట్లో అడుగు పెట్టి రుచికరమైన వంటకాన్ని తయారుచేసేందుకు తిప్పలు పడుతుంటారు. కొన్నిసార్లు అనుకున్నదానికంటే ఎక్కువ పాళ్లలో దినుసులు వేయడమో, లేదంటే కారం ఎక్కువగా వేయడమో చేసి పదార్థం రుచి దెబ్బతింటుందని బాధపడుతుంటారు. కొన్ని సమయాల్లో కొన్నింటిని ఇలా అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
పసుపు ఎక్కువైతే
కూరలలో పసుపు ఎక్కువయితే కూర ఉంచిన పాత్రపై ఒక శుభ్రమైన బట్టను పరచినట్టుగా కడితే, అది ఎక్కువగా ఉన్న పసుపును పీల్చేసుకుంటుంది.
 
గోధుమ రొట్టెలు
గోధుమలు పిండి పట్టించే ముందు శుభ్రంగా కడిగి ఎండబోసి పట్టిస్తే పిండి మెత్తగా వస్తుంది. ఆ పిండితో చేసిన రొట్టెలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. 
 
పన్నీరు కలపాలి
గులాబ్ జామూన్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు, ఆ పిండిలో కాస్తంత పన్నీరు కలపాలి. ఇలా చేయడం వల్ల జామూన్‌లు నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి.
 
ఇడ్లీలు మృదువుగా
ఇడ్లీ పిండి రుబ్బే సమయంలో గుప్పెడు అటుకులుకానీ, గుప్పెడు అన్నం కానీ వేశారంటే... ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి.
 
కాకరకాయ కూర
కాకరకాయ కూర వండేటప్పుడు వీలైతే అందులో రెండు పచ్చి మామిడి కాయ ముక్కలు వేయాలి. అలా చేస్తే చేదు తగ్గడమే కాకుండా, కూరకు కొత్త రుచి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments