షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (17:37 IST)
తనకు షూటింగ్ ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోయానని, అందువల్ల తనకు కాస్త సమయం ఇవ్వాలని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను కోరారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టులకు సంబంధించిన కేసుల్లో కొన్ని రోజుల క్రితం మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
ఆ రెండు సంస్థలకు ఆయన ప్రచారకర్తగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్‌‍ఫ్లూయెన్స్ చేశారనే అభియోగంపై మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ సంస్థలకు ప్రచారం చేసినందుకు మహేశ్ బాబు భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే, షూటింగ్ ఉన్నందు సోమవారం విచారణకు హాజరుకాలేకపోతున్నానని, అందువల్ల తనకు మరికొంత సమయం ఇవ్వాలని ఈడీ అధికారులను ఆయన కోరారు. 
 
కాగా, ఈడీ పంపించిన నోటీసుల ప్రకరాం మహేశ్ బాబు ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు బషీర్ బాగ్‍లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సివుంది. అయితే, ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాను హాజరుకాలేకపోవడానికి గల కారణాలు వివరిస్తూ ఈడీకి లేఖ రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments