Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మసాజ్ సెంటరులో వ్యభిచారం... పోలీసులు వెళ్లి చూడగా...

ఠాగూర్
శుక్రవారం, 24 జనవరి 2025 (08:54 IST)
దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో చెన్నై మహానగరం ఒకటి. ఇక్కడ అనేక అంసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని చెన్నై పోలీసులు శక్తిమేరకు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు పోలీసుల కళ్లుగప్పి ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా చెన్నై అన్నానగరులోని మసాజ్, స్పా సెంటరులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రంలో పడుపు వృత్తిలో నిమగ్నమైవున్న ముగ్గురు యువతులకు విముక్తి కల్పించారు. అలాగే, ఈ స్పా సెంటర్ యజమానురాలు 30 యేళ్ల ప్రేమ అనే మహిళను అరెస్టు చేశారు. ఆమెకు సహకరిస్తూ వచ్చిన బ్రోకర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం చెన్నై మహానగరానికి వచ్చే అమ్మాయిలు, అందమైన మహిళలను ఉపాధి పేరుతో చేరదీసి, ఆ తర్వాత మెల్లగా మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. మరికొందరు యువతులు అయితే, సినిమా, టీవీల్లో వేషాల కోసం చెన్నైకు వచ్చి మధ్యవర్తుల చేతికి చిక్కి వ్యభిచార కేంద్రాల్లో పడుపువృత్తి చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పక్కా సమాచారం అందుకునే పోలీసులు... ఆకస్మిక దాడులు చేస్తూ అక్కడ వ్యభిచార వృత్తిలో ఉండే అమ్మాయిలు, మహిళలను రక్షించి, ప్రభుత్వ మహిళా సంరక్షణా కేంద్రాలకు తరలిస్తున్నారు. 
 
తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ 
 
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి శ్రీసుధ భీమిరెడ్డి. ఫ్రెండ్స్ రోల్స్, వాంప్ తరహా  రోల్స్ చేస్తూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్య విద్యను పూర్తి చేసిన ఈమె యాక్టర్ అయ్యారు. మంచి హైట్‌తో పాటు పర్సనాలిటీ ఆమె సొంతం. పైగా, అందచందాలు కుర్రకారుకు సెగలు పుట్టించేలా ఉంటాయి. అయితే, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు చిత్రపరిశ్రమలో సంచలనంగా మారాయి. 
 
మాజీ ఫిజియోథెరపిస్ట్ అయిన శ్రీసుధ.. కొద్ది రోజుల క్రితం విమానంలో ప్రయాణిస్తుండగా తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడి చెంప ఛెళ్లుమనిపించారు. పైగా, అతను ఎంతలా ఇబ్బంది పెట్టాడో వివరిస్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇపుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు తమ్ముడు శ్యామ్ కె. నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశారంటూ శ్రీసుధ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై ఆమె ఏకంగా పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారు. 
 
అయితే, ఈ కేసు పెట్టిన తర్వాత శ్యామ్ పై కేసును విత్ డ్రా చేసుకోవాలని సినీ పెద్దలు ఒత్తిడి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఆయన అన్నయ్య చోటా కె. నాయుడు దృష్టికి తీసుకెళితో.. నా తమ్ముడుతో ఉన్న సమస్యను సెటిల్ చేస్తా... మరి నాకేంటి అని అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదన్నారు. గత 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు పదేళ్లుగా శ్యామ్‌తో గొడవ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీసుధ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments