Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని... బాధతో అది కోసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (14:51 IST)
తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, తనకు పిల్లలు పుట్టడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలో వాషర్‌మేన్ పేటలో బాబు, దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. 
 
బాబు వయసు 40 సంవత్సరాలు. దేవి వయసు 35 ఏళ్లు. వారికి పెళ్లి జరిగి పదేళ్ళు అయినా ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో బార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బాబుకు మద్యం తాగే అలవాటు ఉంది. దీనిపై కూడా గొడవలు తరచూ జరుగుతూ ఉండేది. ఈ గొడవ కాస్త చాలా పెద్దదైంది. దీంతో గత శుక్రవారం మరోసారి గొడవ జరిగింది. భర్తతో విసిగిపోయిన దేవి అతడిని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
తన భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, మరోవైపు తనకు పిల్లలు పుట్టడం లేదన్న ఆవేదనతో రెండు రోజుల పాటు పూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఉన్న బాబు ఆదివారం కిచెన్ లోకి వెళ్లి కత్తి తెచ్చుకుని తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. అయితే, ఆ నొప్పికి తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తుండగా, ఇరుగుపొరుగు వారు వచ్చి అతడిని పరిశీలించి అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments