భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని... బాధతో అది కోసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (14:51 IST)
తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, తనకు పిల్లలు పుట్టడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలో వాషర్‌మేన్ పేటలో బాబు, దేవి అనే దంపతులు నివసిస్తున్నారు. 
 
బాబు వయసు 40 సంవత్సరాలు. దేవి వయసు 35 ఏళ్లు. వారికి పెళ్లి జరిగి పదేళ్ళు అయినా ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో బార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బాబుకు మద్యం తాగే అలవాటు ఉంది. దీనిపై కూడా గొడవలు తరచూ జరుగుతూ ఉండేది. ఈ గొడవ కాస్త చాలా పెద్దదైంది. దీంతో గత శుక్రవారం మరోసారి గొడవ జరిగింది. భర్తతో విసిగిపోయిన దేవి అతడిని వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
తన భార్య తనను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, మరోవైపు తనకు పిల్లలు పుట్టడం లేదన్న ఆవేదనతో రెండు రోజుల పాటు పూటుగా మద్యం సేవించాడు. ఆ మత్తులో ఉన్న బాబు ఆదివారం కిచెన్ లోకి వెళ్లి కత్తి తెచ్చుకుని తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. అయితే, ఆ నొప్పికి తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తుండగా, ఇరుగుపొరుగు వారు వచ్చి అతడిని పరిశీలించి అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments