Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెషర్స్‌కి ఇక పండగే, నాలుగు దిగ్గజ ఐటీ కంపెనీల్లో లక్ష ఉద్యోగాలు

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (15:08 IST)
గత ఏడాది భారతదేశాన్ని కుదిపేసిన వినాశకరమైన కోవిడ్ మహమ్మారి కారణంగా ఐటీ రంగం కుదేలైంది. భారీ ఉద్యోగ నష్టాన్ని సృష్టించింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో, ఐటి రంగంలో ఉద్యోగాల నియామకాలు పెరుగుతున్నాయి. నాలుగు ప్రధాన సర్వీస్ ప్రొవైడర్లైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, HCL టెక్నాలజీస్ లక్ష మందికి పైగా ఫ్రెషర్లను రిక్రూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 
కంపెనీలు తమ నియామక అంచనాలను వేగవంతం చేశాయని, FY 22 రెండవ త్రైమాసికంలో 50,000 మందిని చేర్చుకున్నాయని, ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నియామకాల సంఖ్య లక్షకు పైగా (1,02,517) చేరిందని నివేదికలు తెలిపాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ భారతదేశంలోని మొత్తం శ్రామికశక్తిలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి.

 
తాము గత ఆరు నెలల్లో రికార్డు స్థాయిలో 43,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లను చేర్చుకున్నట్లు TCS ఈ వారం ప్రారంభంలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మరో 35,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లకు ఉపాధి కల్పిస్తామని, తద్వారా మొత్తం ఆర్థిక సంవత్సరంలో 78,000 మందిని నియమించుకుంటామని కంపెనీ ప్రకటించింది.

 
మరోవైపు, HCL టెక్నాలజీస్ ఈ సంవత్సరం కళాశాల క్యాంపస్‌ల నుండి దాదాపు 22,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది 30,000 మంది ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డ్ చేయాలని కూడా చూస్తోంది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అట్రిషన్ రేటు జూన్ చివరి నాటికి 13.9 శాతం నుంచి 20.1 శాతానికి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments