మరింత ఆలస్యంకానున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2022 (12:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షా ఫలితాలు మరింత ఆలస్యంకానున్నాయి. నిజానికి ఫలితాలను ఈ వారమే విడుదల చేయాల్సివుంది. కానీ, అనివార్య కారణాలతో ఈ ఫలితాలను ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. 
 
ఎంసెట్ విభాగంలో అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొత్తం 94,476 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. గత నెల 30, 31 తేదీల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 80,575 మంది హాజరయ్యారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, గత నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం 1,56,812 మంది హాజరయ్యారు. 
 
ఇకపోతే, ఈ ఫలితాల విడుదల జాప్యంపై తెలంగాణ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాలను వచ్చే వారం విడుదల చేస్తామన్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ కౌన్సెలింగ్‌ను జేఈఈ కౌన్సెలింగ్‌తో అనుసంధానం చేసినట్టు చెప్పారు. కాబట్టి ఇది ఇక్టోబరు చివరివారం వరకు జరుగుతుందని చెప్పారు. నవంబరు ఒకటో తేదీ నుంచి క్లాస్ వర్క్ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments