Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 నుంచి జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (12:44 IST)
దేశ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నుంచి జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 290 నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. అలాగే, ఇతర దేశాల్లోని 18 నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్షన్నర మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. 
 
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని బీటెక్ ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 24, 25, 29, 30, 31వ తేదీల్లో పేపర్ 1 పరీక్షను నిర్వహిస్తారు. అలాగే, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 28వ తేదీ పేపర్-2 పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షను మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు నిర్వహిస్తారు. కాగా, ఈ నెల 24వ తేదీన పరీక్ష రాసే వారు తమ అడ్మిట్ కార్డులను డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. 
 
ఇకపోతే, ఏప్రిల్ 8వ తేదీ నుంచి మొదలయ్యే మెయిన్ చివరి విడత పరీక్ష కోసం వచ్చే నెల 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాల్సివుంటుంది. రెండు విడుతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకును కేటాయిస్తారు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 11 లక్షల మంది హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా లక్షన్నర మంది పరీక్ష రాయనున్నారు. అలాగే, ఈ దఫా తెలుగుతో పాటు ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ కనబరిచిన వారిలో 2.50 లక్షల మంది మాత్రమే జూన్ 4వతేదీన నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments