Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు.. ఉచితంగా శిక్షణ

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (15:25 IST)
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఆన్‌లైన్ కోర్సుల్లో భాగంగా డిజిటల్ ఫౌండేషన్, వెబ్ డెవలపింగ్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కోర్సులను అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కోర్సులను అందించడానికై ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. 
 
మరోవైపు శాటిలైట్ అనుబంధ అంశాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించి, వాటిలోనూ ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ముందుకువచ్చాయి. మరిన్ని వివరాల కోసం https://www.apssdc.in/home/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
 
కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విద్యాసంస్థలన్నీ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.  గత మూడు నెలలుగా విద్యార్థులు కాళీగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆన్ లైన్ కోర్సుల ద్వారా విద్యార్థులకు మేలు చేయొచ్చునని ఏపీ సర్కారు భావించింది. ఇందులో భాగంగానే ఉచితంగా ఆన్ లైన్ కోర్సులకు రంగం సిద్ధం చేసింది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments