Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కాలర్‌షిప్ పరీక్ష - ద్రోణాచార్య IIని ప్రారంభించిన FIITJEE

ఐవీఆర్
సోమవారం, 18 మార్చి 2024 (23:16 IST)
భారతదేశంలో పోటీ పరీక్షల స్వరూపాన్ని మార్చే దిశగా గణనీయమైన పురోగతితో, దేశంలోని ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన FIITJEE, ద్రోణాచార్య (II)ని నిర్వహించనున్నామని ప్రకటించింది. ద్రోణాచార్య (II) పరీక్ష రూపాంతరమైనది. పరీక్షలో హాజరైన తర్వాత, విద్యార్థులు వారి IQ, ఆప్టిట్యూడ్, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను తెలుసుకోగలుగుతారు, వారు తమ నైపుణ్యాలు- ఆసక్తుల ప్రకారం వారి కెరీర్‌కు సరైన మార్గాన్ని కూడా గుర్తించగలుగుతారు.   
 
"ద్రోణాచార్య పరీక్ష పిల్లల ప్రస్తుత, దాగి ఉన్న సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ పోటీ- స్కాలస్టిక్ పరీక్షలతో సమానంగా వున్న ఒక సమగ్ర పరీక్ష. ఇది కోచింగ్ పరిశ్రమతో పాటు సమాజానికి కూడా ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది. ఈ పరీక్ష విద్యార్థులకు అనుకూలీకరించిన ప్రత్యేకమైన బోధనా పద్ధతులు, ప్రయోజనకరమైన స్కాలర్‌షిప్ పథకాల ద్వారా కూడా సహాయపడుతుంది" అని FIITJEE గ్రూప్ డైరెక్టర్ Mr. R. L. త్రిఖా అన్నారు.
 
పరీక్ష 7వ ఏప్రిల్ 2024న నిర్వహించబడుతుంది. VI, VII, VIII, IX, X, XI & XII తరగతులకు వెళ్లే విద్యార్థులు పాల్గొనడానికి అర్హులు. VI, VII & VIII తరగతులకు వెళ్లే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 750 మరియు IX, X, XI & XII తరగతులకు రూ. 1500. విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజుపై 99% వరకు ఫీజు మినహాయింపు రూపంలో ప్రోత్సాహకాలను కూడా పొందవచ్చు. వివరణాత్మక సమాచారం కోసం dronacharyaexam.fiitjee.com/registration-process.htmlని చూడండి. పరీక్ష కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 5 ఏప్రిల్ 2024. విద్యార్థులు fiitjee.com/dronacharya వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ఏదైనా FIITJEE కేంద్రాన్ని సందర్శించి నగదు చెల్లించి ఆఫ్‌లైన్‌లో పరీక్ష కోసం నమోదు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments