Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిమ్స్ పీజీ పరీక్షల్లో టాపర్‌గా గుంటూరు వైద్యురాలు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (11:02 IST)
అఖిల భారత వైద్య విజ్ఞాన మండలి (ఎయిమ్స్) నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల్లో గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించిన వినీత, జూన్ 11న నిర్వహించిన పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచారు. వినీతతో పాటు మరో ఆరుగురికి కూడా నూటికి నూరు మార్కులూ వచ్చాయి.
 
ఎయిమ్స్ నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో పీజీ పరీక్షలు ఒకటి. ఈ పరీక్షల్లో టాపర్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ వినీత చెప్పుకొచ్చారు. తాను పీజీలో జనరల్ మెడిసిన్‌ను ఎంచుకోనున్నానని, గత సంవత్సరం డిసెంబర్‌లోనే తన ఎంబీబీఎస్ పూర్తయిందని తెలిపారు. 
 
ఈ పరీక్షల కోసం కష్టపడ్డానని, ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తన పీజీ విద్యను ఢిల్లీ ఎయిమ్స్ లేదా చండీగఢ్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో గానీ పూర్తి చేస్తానని ఆమె అంటున్నారు. 
 
'పీజీలో ప్రవేశం కోసం ఆరు నెలల క్రితమే ప్రిపరేషన్‌ను మొదలు పెట్టాను. ఎంబీబీఎస్ కోర్సులోని స్టడీ మెటీరియల్సును మరోసారి చదువుకున్నాను. ఓ యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు తీసుకుని పరీక్షకు హాజరయ్యాను' అని వివరించారు. 
 
కాగా, పీజీ ఎంట్రెన్స్‌లో మొత్తం 4,335 మంది ర్యాంకులను అందుకున్నారు. భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చదువుతున్న 74 మందికి ర్యాంకులు లభించాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిమ్స్‌ల్లో చదువుతున్న 29 మందికి వందకు వంద మార్కులు వచ్చాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments