Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు డీఎస్సీ-2008 క్వాలిఫై అభ్యర్థులకు కౌన్సెలింగ్

Webdunia
శనివారం, 10 జులై 2021 (08:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2008లో నిర్వహించిన డీఎస్సీ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులివ్వనున్నాయి. 
 
డీఎస్సీ-2008కి సంబంధించి నియామక ప్రక్రియ మార్పు కారణంగా నిలిచిపోయిన 2,193 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ)లను మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌(ఎంటీఎస్‌)తో కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరి నియామక ఉత్తర్వులు జారీచేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ శుక్రవారం జారీ చేశారు. జిల్లాల డీఈవోలు ఈ నెల 10న అర్హత కలిగిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. 
 
విద్యాశాఖ జారీచేసిన మార్గదర్శకాలు ఇలా వున్నాయి.. 
 
* బదిలీ జరిగినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు అందుబాటులో లేని 3, 4 కేటగిరీలలోని ఖాళీలలో నియమించాలి.
 
* విద్యార్థులు ఉండి, ఉపాధ్యాయులు లేని 3, 4 కేటగిరీలలోని ఖాళీలలో నియమించవచ్చు. 
 
* 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులుండి, బ్లాక్‌ చేయని 3, 4 కేటగిరీలలోని ఖాళీలను వీరితో భర్తీ చేయవచ్చు. 
 
* నియమించవలసిన ఉపాధ్యాయులకు ఖాళీలు సరిపోకుంటే కేటగిరీ-4లోని ఖాళీలను భర్తీ చేయాలి. 
 
* అయినప్పటికీ పోస్టులు చాలకపోతే.. కేటగిరీ-3లో బ్లాక్‌ చేసిన ఖాళీలలో భర్తీ చేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments