Webdunia - Bharat's app for daily news and videos

Install App

23,000 పైచిలుకు ఫ్రెషర్లకు ఉద్యోగాలు.. ఇంటర్న్‌షిప్‌లకు అధిక ప్రాధాన్యత.. కాగ్నిజెంట్‍

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (16:30 IST)
యూఎస్‍ సంస్థ కాగ్నిజెంట్‍ ఈ ఏడాది భారత్‍లో 23,000 పైచిలుకు ఫ్రెషర్లను నియమించుకోనుంది. 2020 ఏడాదితో పోలిస్తే ఇది 35 శాతం పైగా ఎక్కువ అని సంస్థ సీఎండీ రాజేశ్‍ నంబియార్‍ తెలిపారు. 2020 సంవత్సరంలో కంపెనీ 17,000 మందికి పైగా కొత్తగ్రాడ్యుయేట్లను నియమించుకున్నట్లు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 
 
అత్యంత ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్‍, సైన్స్, మేనేజ్‍మెంట్‍ విద్యార్థులతో పాటు ఇతర నిపుణుల నియామకాలను దేశంలో పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న సంస్థలో ఒకటిగా నిలుస్తామని నంబియార్‍ చెప్పారు. గతేడాది క్యాంపస్‍ రిక్రూట్‍మెంట్ల ద్వారా 17 వేల ఫ్రెష్‍ గ్రాడ్యుయేట్లను సంస్థలో చేర్చుకున్నట్టు వెల్లడించారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో భారత్‍ ఒకటిగా ఉంటుందని అన్నారు.
 
కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఈ ఏడాది జనవరి-మార్చిలో పెద్ద ఎత్తున నియామాకాలు ఉంటాయని వివరించారు. 18 నెలల్లో 1.3 లక్షల మంది ఉద్యోగులకు డిజిటల్‍ నైపుణ్యాలను కల్పించామన్నారు. కాగ్నిజెంట్‍లో గతేడాది 5,000 మంది ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేశారు. 2020లో 10,000 మందికి అవకాశం కల్పిస్తారు. కాగ్నిజెంట్‍కు ఇప్పటికే భారత్‍లో సంస్థకు 2.04 లక్షలు ఉద్యోగులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments