ముంబై కేంద్రంగా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (14:48 IST)
అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 
 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్‌పూర్‌, భుసావల్‌, షోలాపూర్‌ డివిజన్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
 
మొత్తం ఖాళీలు: 2532 
అర్హత: పదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదా దానికి సమానమైన (10 +2 విధానంలో) ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎన్‌టీవీసీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. అదేవిధంగా 15 నుంచి 24 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
 
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 6
అప్లికేషన్లకు చివరితేదీ: మార్చి 5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments