Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్సికకు 499/500 మార్కులు : ఆ ఒక్కటి ఎందుకు తగ్గింది? కోర్టుకు వెళతానంటున్న విద్యార్థిని

Webdunia
శనివారం, 4 మే 2019 (15:10 IST)
సాధారణంగా పబ్లిక్ పరీక్షల్లో నూటికి నూరు లేదా 99 మార్కులు వస్తే తెగ సంతోషపడిపోతాం. ఇంటిల్లిపాది సంబరాలు చేసుకుంటారు. ఒకటి రెండు రోజులు ఆ ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. కానీ, ఇక్కడో విద్యార్థిని మొత్తం 500 మార్కులకు గాను 499 మార్కులు సాధించింది. కానీ, ఆ విద్యార్థిని సంతృప్తి చెందడం లేదు. ఆ ఒక్క మార్కు కూడా ఎందుకు తగ్గిందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు తెలిపింది. ఆ విద్యార్థిని పేరు హన్సిక శుక్లా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నివాసి.
 
ఇటీవల సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి.. ఈ పరీక్షల్లో హన్సికకు 500 మార్కులకు గాను 499 మార్కులు వచ్చాయి. ఒక్క ఇంగ్లీషులోనే వందకు 99 మార్కులు వచ్చాయి. మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు వచ్చాయి. ఫలితంగా మొత్తం 500 మార్కులకుగాను ఆ విద్యార్థిని 499 మార్కులు సాధించింది. 
 
అయితే, ఇంగ్లీష్ పరీక్షలో ఆ ఒక్క మార్కు ఎందుకు తగ్గిందన్న అంశంపై న్యాయ పోరాటం చేయాలని ఆ విద్యార్థిని నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ బోర్డు తన ఇంగ్లీష్ సబ్జెక్టు మార్కులను రీటోటలింగ్ చేయని పక్షంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు వెల్లడించింది. ఆమెకు విద్యార్థిని తల్లిదండ్రులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మరోవైపు, మరికొంది విద్యార్థులు మాత్రం.. హన్సిక శుక్లా లేని సమస్యలు సృష్టించుకుంటోందని, రీటోటలింగ్ పెట్టినా, కోర్టు మెట్లెక్కినా మార్కులు ఇంకా తగ్గితే ఏం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments