Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ 15 యేళ్లుగా ఎంపీ... బ్రిటన్ పౌరుడైతే అనుమతిస్తారా? శ్యామ్ పిట్రోడా

Webdunia
శనివారం, 4 మే 2019 (14:50 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా కొట్టిపారేశారు. సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ పోటీ చేస్తున్నది ఇది తొలిసారికాదన్నారు. గత 15 యేళ్లుగా రాహుల్ లోక్‌సభ సభ్యుడుగా ఉంటూ అందరి సభ్యుల్లాగే పార్లమెంట్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు. గత దశాబ్దన్నర కాలంలోరాని అనుమానం ఇపుడే ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 
 
పైగా, బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు మోసపోవడానికి ప్రజలేమైనా అమాయకులనుకుంటున్నారా..? ప్రజలకు అన్నీ తెలుసు, వారిని తక్కువ అంచనా వేయవద్దని పిట్రోడా హెచ్చరించారు. 
 
ప్రతిసారి ప్రజలను మోసం చేయాలకుంటే కుదరదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు మీకు బుద్ధి చెబుతారన్నారు. రాహుల్ పౌరసత్వంపై అనుమానాలు ఉంటే 15 ఏళ్లలో ఎప్పుడైనా అడిగి ఉండవచ్చ. కానీ ఎన్నికలకు రెండు వారాల ముందు అడగడంలో మీ అంతరార్థం ఏమింటో ప్రజలు గ్రహిస్తారని శ్యామ్ పిట్రోడా అన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments