Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాహుల్ గాంధీ నామినేషన్‌పై ఉత్కంఠతకు తెర

Advertiesment
Rahul Gandhi
, సోమవారం, 22 ఏప్రియల్ 2019 (14:09 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్‌పై  నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. అమేథీ లోక్‌సభ స్థానంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 
 
17వ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయినాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్‌లో రాహుల్ గాంధీ తన పౌరసత్వాన్ని తప్పుగా చూపించారనీ, ఆయనకు బ్రిటీష్ పౌరసత్వం ఉందని పేర్కొంటూ స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్‌లాల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. 
 
దీంతో ఆయన నామినేషన్ పత్రాన్ని గత వారంలో ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. అయితే సోమవారం ఈ నామినేషన్ పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నిక సంఘం ధ్రువ్‌లాల్ ఆరోపణలను తోసిపుచ్చుతూ రాహుల్ నామినేషన్‌కు ఓకే చెప్పింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంద శాతం కాదు వెయ్యి శాతం గెలుస్తున్నాం: చంద్రబాబు