Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 19వ తేదీ వరకు ఎంసెట్ రాత పరీక్షలు

Webdunia
సోమవారం, 15 మే 2023 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15వ తేదీ సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు మొదటి దశ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఈ పరీక్ష ప్రారంభమైంది. 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఈఏపీసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23వ తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్సిలర్ ఆచార్య రంగ జనార్థన్ వెల్లడించారు. 
 
ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఇందుకోసం ఉదయం 7.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని వెల్లడించారు. 
 
ఏపీలో 129, తెలంగాణాలో 7 చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 3.40 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు గుర్తింపు కోసం ఏదేనా గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments