ఏపీలో 19వ తేదీ వరకు ఎంసెట్ రాత పరీక్షలు

Webdunia
సోమవారం, 15 మే 2023 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15వ తేదీ సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు మొదటి దశ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఈ పరీక్ష ప్రారంభమైంది. 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఈఏపీసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23వ తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్సిలర్ ఆచార్య రంగ జనార్థన్ వెల్లడించారు. 
 
ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఇందుకోసం ఉదయం 7.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని వెల్లడించారు. 
 
ఏపీలో 129, తెలంగాణాలో 7 చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 3.40 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు గుర్తింపు కోసం ఏదేనా గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments