Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్ఈ విద్యా విధానం అమలు : సీఎం జగన్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (20:20 IST)
రాష్ట్ర ప్రభుత్వం 2021 - 22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
 
ఆయన బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. 
 
దీనికి సంబంధించి ఎఫిలియేషన్‌ కోసం CBSE బోర్డుతో చర్చించి ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కామన్‌ సిలబస్‌ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 
 
ఆంగ్లంపై మరింత పట్టు సాధిస్తే విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కాగా, మాతృభాషకు ఏపీ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇపుడు సీబీఎస్ఈ అంశం తెరపైకి తీసుకునిరావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments