Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గేదే లే అంటున్న చమురు కంపెనీలు... మళ్లీ పెట్రో బాదుడు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:49 IST)
ధరల పెంపుపై ఏమాత్రం తగ్గేదే లే అని చమురు కంపెనీలు అంటున్నాయి. అందుకే మరోమారు పెట్రో వడ్డన విధించాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు మంగళవారం మళ్లీ పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడింది. పైపైకి ఎగబాకుతున్న పెట్రో ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు.
 
మంగళవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో మంగళవారం పెట్రోల్ లీటరు ధర 108.67 రూపాయలకు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ లీటరుపై 25 పైసలు, డీజిల్ లీటరుకు 30 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ లీటరు ధర రూ.102.64, డీజిల్ లీటరు ధర రూ.91.07కు చేరింది. 
 
ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.108.67, డీజిల్ లీటరు ధర రూ.98.80కి పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.23, లీటర్ డీజిల్ ధర రూ. 95.59గా ఉన్నాయి. కోల్‌కత్తాలో పెట్రోల్ రూ. 103.36, డీజిల్ రూ. 94.17కు పెరిగాయి. 
 
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధిదారులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు రేట్లను పరిగణనలోకి తీసుకొని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments