Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లోకి జిక్సర్ మోడల్ బైక్‌లు.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 20 మే 2019 (17:01 IST)
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ సుజుకీ భారత మార్కెట్లోకి కొత్త జిక్సర్ మోడల్ బైక్‌లను విడుదల చేసింది. భారత్‌లో ఈ బైక్‌లు పాపులర్ కావడంతో కంపెనీ ఇంతకుముందు కూడా ఈ సెగ్మెంట్ బైక్‌లను విడుదల చేసింది. 2019 మోడల్ సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 ఏబీఎస్ ప్రారంభ ధరను రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. దీంతో పాటే సుజుకీ సంస్థ జిక్సర్ 150 ఎస్ఎఫ్‌ని కూడా ప్రారంభించి, దీని ప్రారంభ ధరను రూ.1,09,800 గా నిర్ణయించింది.
 
జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోడల్‌లో ఆయిల్ కూల్డ్ 249 సీసీతో ఒకే సిలిండర్ ఇంజన్‌తో అందించబడింది. ఈ ఇంజన్ 26 బీహెచ్‌పి శక్తితో నడుస్తుంది. ఈ బైక్ ఆరు గేర్‌లతో, ఎల్ఈడీ హెడ్ లైట్స్‌తో, స్ప్లిట్ సీట్స్, 17 అంగుళాల మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్‌తో అందించబడింది. ఈ బైక్‌లో డ్యుయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరో విశేషం. జిక్సర్ ఎస్ఎఫ్ 250లో టెలీస్కోపిక్ ఫోర్క్స్ ఉండగా, ఇవి ముందువైపు ఉంటాయి. వెనుకవైపు మోనోషాక్ ఉంటుంది. ఈ బైక్‌లో డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్ ఇవ్వబడింది.
 
2019 సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 రియర్, ఫ్రంట్‌లో డిస్క్ బ్రేకులు ఉన్నాయి, 250 సీసీకి చెందిన ఈ బైక్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. భారత్‌లో ఈ బైక్ యమహా ఫేజర్ 25, హోండా సీబీఆర్, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, కెటిఎం ఆర్సీ 200 వంటి బైకులతో పోటీ పడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments