Publish Date: Mon, 20 May 2019 (16:15 IST)
Updated Date: Mon, 20 May 2019 (16:19 IST)
ఎస్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ రహస్యాన్ని బయటపెట్టేశాడు. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ ఓ వీడియోను పోస్టు చేస్తూ తనకు సంబంధించిన ఓ రహస్యాన్ని వెల్లడించాడు. ఆ రహస్యాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. తాను ఓ చిన్నారినని.. త్వరలో చిత్రకారుడిగా ఎదుగుతానని ధోనీ తెలిపాడు.
క్రికెట్ మ్యాచ్లు ఆడుతూనే.. తాను పెయింటింగ్ చేయడం మొదలెట్టానని ధోనీ చెప్పాడు. ఇలా ఇప్పటికే కొన్ని పెయింటింగ్స్ చేశానని.. ఇలా పెయింటింగ్స్ చేస్తూ తన కెరీర్ను ముందుకు సాగించాలనుకుంటున్నానని తెలిపాడు. త్వరలో ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయనున్నానని.. ఆ ఎగ్జిబిషన్లో తన పెయింటింగ్స్ కూడా వుంటాయని తెలిపాడు.
ఈ వీడియోలో ధోనీ తాను పెయింట్ చేసిన చిత్రాలను వరుసగా చూపెట్టాడు. ఇంకా ఆ పెయింటింగ్స్ అందరికీ నచ్చుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో మొదటిసారిగా బ్యూటీఫుల్ ల్యాండ్ స్కేప్ను పెయింట్ చేశానన్నాడు. ఇంకా ఫ్యూచర్ ఫ్లైన్ను గీశానని.. ఇక బ్యాటు, బాలుతో తనకు ఫేవరెట్ అయిన క్రికెట్కు సంబంధించిన బొమ్మను గీశానని చెప్పుకొచ్చాడు.
క్రికెట్ బొమ్మను గీసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నానని.. తాను గీసిన ఈ పెయింటింగ్స్ను ఎగ్జిబిషన్లో పెట్టేందుకు ఆర్టిస్ట్స్ కమ్యూనిటీ ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. ఇందుకు కాస్త సమయం తీసుకోవచ్చునని ధోనీ వెల్లడించాడు. ఈ పెయింటింగ్స్ను ఆదరిస్తానని, లైక్ చేస్తారని భావిస్తున్నట్లు ధోనీ తెలిపాడు.
webdunia
Publish Date: Mon, 20 May 2019 (16:15 IST)
Updated Date: Mon, 20 May 2019 (16:19 IST)