Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్

Webdunia
సోమవారం, 20 మే 2019 (16:56 IST)
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్‌ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో రిలయన్స్ జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికాం కంపెనీలు మూతపడగా, జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని తమ ఖాతాదారులు చేజారిపోకుండా ఎయిర్‌టెల్ జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లపై 1000 జీబీ డేటాను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
 
ఈ ఆఫర్ గడువు మార్చి 31తోనే ముగిసింది, అయితే కస్టమర్‌ల కోసం దీనిని మరింతకాలం పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ క్రింద ఎయిర్‌టెల్ ఖాతాదారులకు రూ.799 ప్లాన్‌లో 100 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 500 జీబీ డేటాను అదనంగా అందిస్తోంది. 
 
రూ.999 ప్లాన్‌లో 250 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 1000 జీబీ డేటా లభించనుంది. రూ.1,299, రూ.1999 ప్లాన్‌లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 999 ఆపై ప్యాక్‌లపై డేటా రోలోవర్ సౌకర్యం కూడా ఉన్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments