Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ళ్లీ పెరిగిన‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

Webdunia
శనివారం, 8 మే 2021 (15:59 IST)
దేశంలో మ‌ళ్లీ పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. వ‌రుస‌గా నాలుగో రోజూ పెట్రో ధ‌ర‌ల‌ను పెంచుతూ దేశీయ చ‌మురు కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి. 
 
దీంతో దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో లీట‌ర్‌ పెట్రోల్‌పై 25-28 పైస‌లు, డీజిల్‌పై 30-33 పైస‌ల వ‌ర‌కు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.91.27, డీజిల్‌ రూ.81.73కు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.97.61, డీజిల్‌ రూ.88.82, చెన్నైలో పెట్రోల్‌ రూ.93.15, డీజిల్‌ రూ.86.65, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.41, డీజిల్‌ రూ.84.57కు చేరాయి.
 
 బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.30, డీజిల్‌ రూ.86.64కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.86, డీజిల్‌ రూ.89.11కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.65, డీజిల్‌ రూ.90.25గా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి.
 
 ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో సుమారు రెండు నెల‌ల‌పాటు దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. ఎన్నిక‌లు ముగియ‌డంతో గ‌త నాలుగు రోజులుగా ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. దీంతో ఢిల్లీలో నాలుగు రోజుల్లో పెట్రోల్ పై 82 పైస‌లు, డీజిల్‌పై రూ.1 పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments